Bus accident: కైలాసగిరిపై బస్సు బోల్తా

అదుపుతప్పి టూరిస్ట్‌ బస్సు బండరాయిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 


Published Sep 09, 2024 06:24:59 PM
postImages/2024-09-09/1725886499_busaccidentinkailasagiri.jpg

న్యూస్ లైన్ డెస్క్: విశాఖపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. కైలాసగిరిపై వెళ్తున్న బస్సు బోల్తా పడింది. అదుపుతప్పి టూరిస్ట్‌ బస్సు బండరాయిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు. 

గాయపడిన వారిని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి హాస్పిటల్‌కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. 

newsline-whatsapp-channel
Tags : ap-news news-line newslinetelugu telanganam

Related Articles