Leader: టీషర్ట్ వేసుకున్న పెద్దాయను గుర్తుపట్టారా? 

ఒకప్పుడు స్టైలిష్ గా ఉండే జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా మారిపోయారు.


Published Sep 08, 2024 06:44:47 AM
postImages/2024-09-08/1725795426_jcreddy.PNG

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డికి ప్రత్యేకం స్థానం ఉంది. రాయలసీమ రాజకీయాల్లో జేసీ ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్‌తో తనదైన శైలిలో రాజకీయాలు నడిపించారు. ముక్కుసూటిగా, మనసులో ఏమనిపిస్తే అది నిర్మొహమాటంగా చెప్పేస్తారు. ఆయన కారణంగా కొన్నిసార్లు ప్రభుత్వాలే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇక జేసీ దివాకర్ నోటి నుంచి వచ్చే ప్రతిమాట తూటాల్లా పేలుతాయి. కాగా, అలాంటి ఆయన గత కొన్నాళ్లుగా మీడియా ముందు కనిపించడం లేదు. అయితే తాజాగా జేసీ దివాకర్ రెడ్డి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ ఫోటోను చూసిన ప్రజలు ఆసలు జేసీకి ఏమైంది? జేసీ దివాకర్ ఎక్కడ ఉన్నారు అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒకప్పుడు స్టైలిష్ గా ఉండే జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. గత కొంత కాలంగా దివాకర్ రెడ్డి అనారోగ్య కారణాల వల్ల పూర్తిగా మారిపోయారు. కొన్ని రోజులుగా జేసీ దివాకర్ ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఆదివారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. జేసీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana andhrapradesh viral-news social-media

Related Articles