Students: ఫ్రెండ్స్‌పై విద్యార్థిని ఎక్స్పరిమెంట్.. 20 మందికి అస్వస్థత

బాపట్లలోని ఓ పాఠశాలలో ఆరో తరగతి చదివే విద్యార్థిని తోటి విద్యార్థులపై ప్రయోగం చేసింది. కాఫీ పొడిలో నిమ్మకాయ  కలిపిన మిశ్రమాన్ని తన ఫ్రెండ్స్‌కి ఇచ్చింది. దీంతో ఆ మిశ్రమాన్ని తాగిన 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.


Published Aug 24, 2024 03:18:58 PM
postImages/2024-08-24/1724492938_schoolstudentssick.jpg

న్యూస్ లైన్ డెస్క్: తన ఫ్రెండ్స్‌పై ఓ విద్యార్థిని చేసిన ఎక్స్పరిమెంట్ కారణంగా విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. బాపట్లలోని ఓ పాఠశాలలో ఆరో తరగతి చదివే విద్యార్థిని తోటి విద్యార్థులపై ప్రయోగం చేసింది. కాఫీ పొడిలో నిమ్మకాయ  కలిపిన మిశ్రమాన్ని తన ఫ్రెండ్స్‌కి ఇచ్చింది. దీంతో ఆ మిశ్రమాన్ని తాగిన 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థులను గమనించిన స్కూల్ యాజమాన్యం బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. చిన్నారులను పరిక్షించిన డాక్టర్లు ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు గుర్తించారు. చిన్నారులకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : ap-news chandrababu andhrapradesh news-line newslinetelugu telanganam food-poison

Related Articles