AP: ట్రాక్‌పై చంద్రబాబు.. మూడడుగుల దూరంలో ట్రైన్..!

బుడమేరు కింద నుంచి ప్రవహిస్తుండటంతో సరిగా కనిపించడం లేదని చంద్రబాబు రైల్వే ట్రాక్ ఎక్కారు. సరిగ్గా అదే సమయంలో ట్రైన్ వచ్చింది. 


Published Sep 05, 2024 07:37:22 AM
postImages/2024-09-05/1725537451_Chandrababuonrailwaytrack.jpg

న్యూస్ లైన్ డెస్క్: విజయవాడ వరద ప్రభావిత  ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఏలూరు కాల్వ బల్లకట్టుపై దాటి బుడమేరు ముంపును పరిశీలించారు. ఆ తర్వాత గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు.

ఈ క్రమంలోనే మధురానగర్‌ రైల్వే ట్రాక్ వద్ద నుంచి బుడమేరును పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబు పెను ప్రమాదం తప్పింది. బుడమేరు కింద నుంచి ప్రవహిస్తుండటంతో సరిగా కనిపించడం లేదని చంద్రబాబు రైల్వే ట్రాక్ ఎక్కారు. సరిగ్గా అదే సమయంలో ట్రైన్ వచ్చింది. 

ట్రైన్‌ను చూసి వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. చంద్రబాబు సహా అందరు ట్రాక్ నుంచి పక్కకు జరిగారు. ఇంతలో కార్యకర్తలు, సిబ్బంది వెళ్లి రైల్వే లైన్‌మెన్‌ను తీసుకువచ్చి ఎర్రజెండా ఊపారు. దీంతో చంద్రబాబుకు కేవలం మూడడుగుల దూరంలో ట్రైన్ ఆగిపోయింది. దీంతో చంద్రబాబు సహా అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 


 

newsline-whatsapp-channel
Tags : ap-news chandrababu andhrapradesh tdp news-line newslinetelugu appolitics telanganam chandrababu-naidu

Related Articles