డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష, సూర్యారాధనలు చేస్తున్నారు. ఆర్ష ధర్మం , సనాతన సంస్కృతి పట్ల చాలా గౌరవం తో ఈ పూజలు చేస్తున్నారు. అయితే ఎందుకు ఈ వారాహి దీక్షలు చేస్తున్నారంటే.. విజ్ఞానాభివృద్ధికీ, సుఖ సంతోషాలకు, క్షేమానికీ ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడిని ఆరాధించడం హిందువులందరికి తెలిసిందే. ఆరోగ్యంగా బతకడానికి సూర్యున్ని పూజిస్తాం..ఇది అందరికి తెలిసిందే. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అనే సూక్తిని ఆయుర్వేద నిపుణులు ప్రస్తావిస్తారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష, సూర్యారాధనలు చేస్తున్నారు. ఆర్ష ధర్మం , సనాతన సంస్కృతి పట్ల చాలా గౌరవం తో ఈ పూజలు చేస్తున్నారు. అయితే ఎందుకు ఈ వారాహి దీక్షలు చేస్తున్నారంటే.. విజ్ఞానాభివృద్ధికీ, సుఖ సంతోషాలకు, క్షేమానికీ ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడిని ఆరాధించడం హిందువులందరికి తెలిసిందే. ఆరోగ్యంగా బతకడానికి సూర్యున్ని పూజిస్తాం..ఇది అందరికి తెలిసిందే. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అనే సూక్తిని ఆయుర్వేద నిపుణులు ప్రస్తావిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, కోరుతూ .. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజాదికాలు నిర్వహించారు. అందులోను వారాహి ఏకాదశ దిన దీక్ష లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ దీక్షలో భాగంగానే సూర్యునికి పూజలు చేస్తున్నరు.
అయితే పవన్ కళ్యాణ్ వెన్ను సంబంధిత సమస్యలున్నాయట. ఇంతకు ముందు వరకు పవన్ యోగాలో సూర్య నమస్కారాలు చేసే వారట. కాని ఎప్పుడైతే వెన్ను నొప్పి మొదలయ్యిందో అప్పటి నుంచి సూర్యనమస్కారాలు చేయడం లేదట. సూర్యఆరాధన మాత్రమే చేస్తున్నట్లు తెలిపారు.పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష, సూర్యారాధనలు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాల శర్మల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.