Gold man: తిరుమలలో గోల్డ్ మ్యాన్ ప్రత్యక్షం.. ఒంటి మీద 25 కేజీల బంగారం

వీరు వస్త్రధారణ , వేషం , ఒంటి మీదున్న 25 కేజీల బంగారం చూసి జానలు ఆశ్చర్యపోయారు.


Published Aug 23, 2024 12:36:00 PM
postImages/2024-08-23/1724396873_punedevotees202408792840.jpeg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  తిరుమల క్షేత్రానికి దూరప్రాంతాల నుంచి భక్తులు రావడం షరా మామూలే. వేలాది మంది భక్తుల్లో కొందరు మాత్రం చాలా స్పెషల్ గా ఉంటారు. వీఐపీలు, వీవీఐపీల ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఈ రోజు ఉదయం పూణే నుంచి గోల్డ్ మెన్, గోల్డ్ ఉమెన్ లు స్వామివారి దర్శనం చేసుకున్నారు. వీరు వస్త్రధారణ , వేషం , ఒంటి మీదున్న 25 కేజీల బంగారం చూసి జానలు ఆశ్చర్యపోయారు.


వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడటం మరింత కామన్. కానీ ఓ సామాన్యుడిని చూసేందుకు తిరుమలలోని భక్తులు శుక్రవారం ఈ గోల్డ్ మెన్ తో ఫొటోలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.కేజీల కొద్దీ బంగారాన్ని ఒంటిపై దిగేసుకుని అతగాడు.. అలా నడుస్తూ ఉంటే మిగతా భక్తులు కళ్లు పెద్దవి చేసి మరీ గమనించారు


పూణే నుంచి వచ్చిన వీరు యూట్యూబర్స్ కూడా. నార్త్ వైపు వీళ్లు చాలా ఫేమస్ కాని తెలుగు రాష్ట్రాల్లో వీరి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన వీరిని చాలా స్పెషల్ గా చూశారు. ఫొటోలకు ఎగబడ్డారు. మొత్తం ముగ్గురు ఒంటి మీద దాదాపు 25 కేజీల బంగారం ఉండచ్చని కూడా తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : andhrapradesh newslinetelugu pune tirupati

Related Articles