న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆంధ్రా, తెలంగాణ లో ప్రయాణాలు చేసే వారు ప్రతి ఒక్కరికి ..జన్మభూమి తెలిసిందే.. విశాఖ-లింగంపల్లి జన్మభూమి( janmabhumi) ఎక్స్ ప్రెస్ ను రైల్వే శాఖ ( railway department) మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది రైల్వే శాఖ. విజయవాడ( vijayawada) డివిజన్ లో ఆధునికీకరణ పనులు చేపట్టడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది.
నిడదవోలు-కడియం సెక్షన్ లో ఆధునికీకరణ పనుల నేపథ్యంలో... జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్( ratnachal) వంటి ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు వందేభారత్ కోసమే ఈ ట్రైన్లను రద్దు చేశారని విమర్శలు కూడా ఎదుర్కుంది. అయితే ఆధునీకణ పనులు అయిపోగానే తిరిగి ఈ ట్రైన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ప్రయాణికుల నుంచి భారీ ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుండడంతో రైల్వే శాఖ తన నిర్ణయాన్ని మార్చుకుంది. జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 25 నుంచి మామూలుగానే నడపాలని తాజాగా నిర్ణయించింది. జన్మభూమి ఎక్స్ ప్రెస్ తో పాటు విజయవాడ-కాకినాడ పోర్టు, చెంగల్పట్టు-కాకినాడ పోర్టు రైళ్లను కూడా పునరుద్ధరిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది.