Gold Price Today: ధర తగ్గిన బంగారం ..లక్ష మార్క్ దాటేసిన వెండి

చైనాలో డిమాండ్ పడిపోవడం, అలాగే దేశంలో మోదీ సర్కార్ బడ్జెట్‌లో గోల్డ్, సిల్వర్‌పై సుంకాలు తగ్గించడం వల్ల బంగారం రేట్లు కాస్త తగ్గుముఖం పట్టాయి.


Published Aug 03, 2024 07:57:00 AM
postImages/2024-08-03/1722652113_gold.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బడ్జెట్ ప్రవేశపెట్టాక బంగారం ధరలు కాస్త దిగి వచ్చాయి. కొనే వారికి ఇది పండగలాంటి అవకాశం దాదాపు రెండు వేల మేర తగ్గినట్లు అంచనా. రేట్లు పెరగడం వల్ల చైనాలో డిమాండ్ పడిపోవడం, అలాగే దేశంలో మోదీ సర్కార్ బడ్జెట్‌లో గోల్డ్, సిల్వర్‌పై సుంకాలు తగ్గించడం వల్ల బంగారం రేట్లు కాస్త తగ్గుముఖం పట్టాయి.


తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. బంగారం ధర జూలై 17న ఆల్‌టైమ్  ధర రూ. 75 వేలకు చేరింది. జూలై 26న గోల్డ్ రేటు ఏకంగా రూ. 68,730 స్థాయికి క్షీణించింది. ఒక రోజు తగ్గుతు మరో రోజు పెరుగుతూ ఆగస్ట్ 3న బంగారం ధర రూ. 70,700 వద్ద ఉంది.


ఇక ఇప్పుడు వెండి ధరల విషయానికి వస్తే.. సిల్వర్ రేటు జూలై 17న రూ.లక్ష మార్క్‌ను దాటేసింది. రూ.లక్షా 500 వద్ద ఉంది. అయితే జూలై 25 నాటికి ఈ వెండి రేటు రూ. 89 వేలకు పడిపోయింది. తర్వాత ఆగస్ట్ 3 నాటికి రూ. 91 వేల స్థాయికి చేరింది. కేజీకి ఈ రేట్లు వర్తిస్తాయి. అయితే మరల వెండి వస్తువుల్లో తీసుకుంటే మేకింగ్ ఛార్జీలు , జీఎస్టీలు కలిపి లక్ష దాటేస్తుంది. కాని జూలై నెలతో పోలిస్తే కాస్త అటు ఇటుగా తగ్గినట్లే.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles