maserati: భారత్ మార్కెట్లో ఇటాలియన్ లగ్జరీ కారు ?

భారత మార్కెట్లో ఇటాలియన్ లగ్జరీ కార్ మసెరటి(Maserati) కొత్త SUV గ్రెకేల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది.


Published Aug 02, 2024 09:14:39 AM
postImages/2024-08-02/1722607350_car.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : భారత మార్కెట్లో ఇటాలియన్ లగ్జరీ కార్ మసెరటి కొత్త SUV గ్రెకేల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. మూడు వేరియంట్లలో వస్తున్న ఈ SUV ప్రారంభ ధర రూ. 1.31 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. దీని రేటు రూ. 96.05 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 


ఎక్ట్సీరియర్ గురించి చెప్పాలంటే, కంపెనీ స్పెషల్ సిగ్నేచర్ స్టైల్ స్టేట్‌మెంట్ గ్రిల్ గ్రేస్కేల్‌లో ఇచ్చారు. దీనిలో chrome-finish, పెద్ద సైజు బంపర్ మెరుగైన లుక్ ఇస్తుంది. ముందు భాగంలో మసెరటి లోగో, ట్విన్ డ్యూయల్-ఎగ్జాస్ట్ టిప్, LED హెడ్‌లైట్ సెటప్‌తో ఫినిషింగ్   ఇచ్చారు. దీని టాప్ స్పీడ్ గంటకు 240 కి.మీ. అయితే, దీనికి లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ అండ్ అడాప్టివ్ సస్పెన్షన్ ఇచ్చారు. 


ప్రీ-కాన్ఫిగర్డ్ కార్స్ ఇప్పటికే అమ్మకానికి ఉన్నాయని కంపెనీ తెలిపింది. అయితే కస్టమర్లు వారి  సెలక్షన్ ప్రకారం ఈ కారును కస్టమైజ్ చేసుకునే  సౌకర్యం కూడా ఉంటుంది. అయితే కస్టమైజ్డ్ మోడల్ డెలివరీ కోసం దాదాపు 5 నుంచి 8 నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.  అయితే భారత్ రోడ్లకు ఈ కారు ఎక్సీపీరియన్స్ పై చాలా వరకు అనుమానాలున్నా...బాగా డబ్బున్న వారికి మాత్రం ఈ కారు డ్రీమ్ కారు అనే చెప్పాలి.
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu business

Related Articles