Gold : మరింత దిగొచ్చిన పసిడి ధర..వెండి రేటు ఎంతంటే ..?

దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి ధర  22 క్యారట్లు ...నిన్నటి రేటు మీద రూ. 10 దిగొచ్చి.. రూ. 64,690కి చేరింది.


Published Aug 06, 2024 07:17:00 AM
postImages/2024-08-06/1722908886_gold.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి ధర  22 క్యారట్లు ...నిన్నటి రేటు మీద రూ. 10 దిగొచ్చి.. రూ. 64,690కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 64,700గా ఉండేది. ఇప్పుడు 24 క్యారట్లు పసిడి  7057 రూపాయిలు ధర గా నడుస్తుంది. ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం పది రూపాయిలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,840గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,720గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,690 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 70,570గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలన్నింటిలోను దాదాపు ఇదే బంగారం ధర నడుస్తుంది.


వెండి కూడా..
దేశంలో వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,580గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 85,800కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 85,700గా ఉండేది. మరింత పెరిగే అవకాశముందంటున్నారు వ్యాపారులు.


ప్లాటీనం ధరలు ఇలా..
10గ్రాముల ప్లాటీనం ధర రూ. 160 తగ్గి.. రూ. 25,590కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,750గా ఉండేది. విజయవాడ, విశాఖపట్నం, పెద్ద పెద్ద రాష్ట్రాలన్నింటిలోను ఇదే రేటు కొనసాగుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles