ABVP: ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.


Published Aug 02, 2024 06:24:07 PM
postImages/2024-08-02/1722603247_osma.jpeg

న్యూస్ లైన్ డెస్క్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విసిల పదవి కాలం ముగిసి దాదాపు 3 నెలలు కావస్తున్న ఇప్పటివరకు వీసీలను నియమించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇన్చార్జ్ వీసీలతో కాలయాపన చేస్తూ యూనివర్సిటీల యొక్క మనగాడకే ముప్పు తీసుకువస్తున్నారు అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే యూనివర్సిటీలకు మహర్దశ తీసుకొస్తాం, పునర్జీవం పోస్తామని డబ్బా కొట్టారు. కానీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 నెలల సమయం కావస్తున్న ఇప్పటివరకు యూనివర్సిటీల సంక్షేమం గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. 

మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది అని అన్నారు. యూనివర్సిటీలలో 82% ఖాళీగా ఉన్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అన్యక్రాంతమవుతున్న యూనివర్సిటీ భూములను కాపాడాలని, అశాస్త్రీయంగా పెంచిన పిజీ, ఇంజనీరింగ్ పిహెచ్డి ట్యూషన్ మరియు ఎగ్జామ్ ఫీజులను తగ్గించాలని, అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి మెరుగైన హాస్టల్ వసతి కల్పించాలని, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైస్ చెయ్యాలని డిమాండ్ చేశారు .తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల మీద పోలీసులు జులుం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ & విద్యానగర్ విభాగ్ కన్వీనర్ పృథ్వి తేజ, స్టేట్ అల్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ శ్రీహరి ,కమల్ సురేష్, సుమన్ శంకర్, రాజు మరియు ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana students congress cm-revanth-reddy abvp osmaniauniversity

Related Articles