Assembly: నిండు సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బూతుపురాణం

 ఏ ముస్కోవోయ్.. నీ అమ్మ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తోలు తీస్తా, బయట తిరగనియ్య కొడకా.. ఏమనుకుంటున్నారు రా అంటూ అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు. 


Published Aug 02, 2024 07:17:44 AM
postImages/2024-08-02/1722600847_newslinetelugu13.jpg

న్యూస్ లైన్ డెస్క్: చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి-వేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే BRS నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నోరు పారేసుకున్నారు. BRS ఎమ్మెల్యేలను బయట తిరగనియ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిండు అసెంబ్లీలో ఆయన BRS ఎమ్మెల్యేలపై బెదిరింపులకు పాల్పడ్డారు. దానం వ్యాఖ్యలపై సభలో BRS ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. 
 
హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలపై అసెంబ్లీలో చర్చలు జరిపారు. చర్చను ప్రారంభించిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌.. BRS సభ్యులపై పరుష పదజాలం వాడారు. ఏ ముస్కోవోయ్.. నీ అమ్మ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తోలు తీస్తా, బయట తిరగనియ్య కొడకా.. ఏమనుకుంటున్నారు రా అంటూ అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు. 

దీంతో BRS సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ ముందుగానే ఇటువంటి పురుషపదజాలం ఉపయోగించి బెదిరిస్తుంటే.. స్పందించరా అని ప్రశ్నించారు. దీంతో అసెంబ్లీలో ఆందోళన నెలకొంది. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news tspolitics telangana-bhavan telanganam assembly assemblytelangana nageshwar-rao

Related Articles