gulshan: జాన్వీ గురించి నేనేం తప్పుగా మాట్లాడలేదు..నన్నెందుకు ట్రోల్ చేస్తున్నారు

బాలీవుడ్ హీరోయిన్ " జాన్వీ కపూర్ "  ప్రస్తుతం సోషల్ మీడియా సెన్షేషన్. తన నెక్స్ట్ మూవీ " ఉలఝ్" ఈ మూవీలో గుల్షన్ దేవయ్య తో నటించారు. సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్నారు.


Published Jul 23, 2024 03:50:02 PM
postImages/2024-07-23//1721730002_janvikapoor.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ " జాన్వీ కపూర్ "  ప్రస్తుతం సోషల్ మీడియా సెన్షేషన్. తన నెక్స్ట్ మూవీ " ఉలఝ్" ఈ మూవీలో గుల్షన్ దేవయ్య తో నటించారు. సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగష్టు 2 వ తేదీన ఆడియన్స్ ముందుకు రావడం సంగతి తెలిసిందే. జాన్వీ, గుల్షన్ ఇద్దరూ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు.  రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో జాన్వీకపూర్ పై గుల్షన్ కామెంట్స్ చేశారు. 


జాన్వీ అంత ఫ్రెండ్లీ కాదు..కాని మంచి యాక్టర్ .  ‘జాన్వీ కపూర్ తో నాకు ఫ్రెండ్లీ రిలేషన్ లేదు. కాకపోతే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నాతో మాట్లాడేది’ అంతకు మించి నాతో మాట్లాడలేదు. అంటూ కామెంట్ చేశాడు. దీంతో నెట్టింట్లో రచ్చరచ్చ రేపుతున్నారు. గుల్షన్ పై నెగిటివ్ ట్రోల్స్ చేశారు. దీంతో తాజాగా ఈ విషయం స్పందించిన గుల్షన్.. ”మా ఇద్దరి మధ్య మంచి స్నేహం లేదు అని అన్నాను, కానీ అది మా ఇద్దరి తప్పు కాదు. ఇక జాన్వీ మంచి నటి. చాలా ప్రొఫెషనల్ గా నటిస్తారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటు కామెంట్ చేశాడు గుల్షన్.


”అలాగే ఏ సినిమాలో అయిన సెట్ లో ఉండే చిత్రబృందమంతా కుటుంబంలా కలిసిపోవాలనే నిబంధన లేదు కదా. పైగా ఇక్కడ ఎవరినీ కించపరచడం లేదు. అంతేకాకుండా.. ఉద్దేశపూర్వకంగా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. అయినా ట్రోల్స్ చేసేవారికి కాదు...నేను నా మనసుకు సర్ధిచెప్పుకుంటున్నా..నేను తప్పు మాట్లాడలేదంటు చెప్పుకొచ్చాడు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news janhvi-kapoor

Related Articles