Farmers: సీఎం రేవంత్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు.. రైతుల ఆవేదన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని రైతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.


Published Aug 09, 2024 07:04:05 AM
postImages/2024-08-09/1723203141_kfarmers.PNG

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలంటూ రైతులను బెదిరిస్తున్నాడని.. ఈ విషయంలో తమకు అండగా నిలవాలని నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల రైతులు శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తెలంగాణా భవన్‌లో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. దుద్యాల్ మండలంలోని హకీంపేట్, పోలెపల్లి, లకచర్ల గ్రామంలో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు కేటీఆర్‌కు వివరించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి మహిపాల్ ముదిరాజ్, ఇతర నాయకులు కేటీఆర్‌ను కలిశారు.

ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని తమకు ఈ ఫ్యాకర్టీలు వద్దని రైతులు చెబుతున్నప్పటికీ సీఎం అన్న తిరుపతి రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని తమకు బీఆర్ఎస్ అండగా నిలవాలని కేటీఆర్ ను కోరారు.

లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ వద్ద నుంచి లాక్కునేందుకు కుట్ర చేస్తుందని రైతులు ఆరోపించారు. వ్యవసాయంపై ఆధారపడిన తమ కుటుంబాలకు ఈ భూమినే జీవనాధారం అని.. ఈ భూములను గుంజుకుంటే తమ జీవితాలు సర్వనాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పకుండా ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని రైతులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు.


 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs ktr farmers kodangal

Related Articles