Raj Tarun: నమ్మించి మోసం చేశాడు.. లావణ్య సంచలన ఆరోపణ

Published 2024-07-05 02:42:04

postImages/2024-07-05/1720164517_modi32.jpg

న్యూస్ లైన్ డెస్క్: సినీ హీరో రాజ్ తరుణ్‌పై యువతి సంచలన ఆరోపణలు చేసింది. 11 ఏళ్లుగా తనతో రిలేషన్ షిప్‌లో ఉన్న రాజ్.. తనకు దూరంగా ఉంటున్నాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజే తనకు ప్రపంచమని, తనకు రాజ్ కావాలంటూ వాపోయింది. 

రాజ్‌తరుణ్‌తో 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామని ఫిర్యాదులో పేర్కొంది. తామిద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నామని, ఓ సినీ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకుని ఆ తర్వాత తనను వదిలేశాడని తెలిపింది. రాజ్ మూడు నెలలుగా ఇంటికి రావడం లేదని, తనతో పరిచయం లేకుండా ఉన్నాడని చెప్పింది. లేని పక్షంలో ప్రాణత్యాగం చేస్తానని ఆమె పేర్కొంది. తాను గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుని 45 రోజులు జైలులో ఉన్నప్పుడు కూడా, తనకు రాజ్ ఎలాంటి సహాయం అందించలేదని వాపోయింది.

ఈ ఏడాది జనవరిలో లావణ్య డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. నార్సింగి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌ను తరలించారు. ఉనీత్ రెడ్డి అనే యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు రాజ్ తరుణ్‌తో లింకులు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఉన్నత చదవుల కోసం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన లావణ్య.. కోకాపేటలో మ్యూజిక్ టీచర్‌గా పిల్లలకు సంగీత పాఠాలు చెప్పుకుంటూ వస్తోంది. పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో హీరోయిన్‌గా.. ఉనీత్ రెడ్డితో కలిసి ఆమె నటించడం విశేషం. సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేసింది. ఈ క్రమంలోనే జల్సాలకు అలవాటు పడిన లావణ్య.. ఉనీత్ రెడ్డితో పాటు ఇందిరతో కలిసి డ్రగ్స్‌ అమ్ముతున్నట్టు తేలింది. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొస్తున్న లావణ్య బ్యాచ్‌.. ఒక్క గ్రామును రూ.6 వేలకు అమ్ముతున్నట్లుగా పోలీసులు తెలిపారు.