Maruthi: ఆ హీరోయిన్ వెంకటేష్ ని దారుణంగా అవమానించింది.!

విభిన్న సినిమాలు తీస్తూ డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న మారుతి అంటే ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ మారుతి నయనతార గురించి సంచలన కామెంట్లు చేశారు.ఆయన మాట్లాడుతూ.. నేను బాబు బంగారం సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సమయంలో నయనతార చాలా తప్పుగా ప్రవర్తించింది.ఆమె తన ఇష్టం ఉన్నప్పుడు షూటింగ్ సెట్ కి వచ్చి ఇబ్బంది పెట్టింది. అయితే నేను చిన్న డైరెక్టర్ కావడంతో ఆమె నన్ను లెక్క చేయలేదు. నన్ను మాత్రమే కాదు హీరో వెంకటేష్ ని కూడా అవమానించినట్లే..ఎందుకంటే అంత పెద్ద హీరో వెంకటేష్..కనీసం ఆయనకి విలువ ఇచ్చి సినిమా షూటింగ్ కి తొందరగా వచ్చి ఉంటే బాగుండేది.కానీ నయనతార మాత్రం మా అందరిని దారుణంగా అవమానించింది. అంటూ డైరెక్టర్ మారుతి నయనతారతో తనకి ఎదురైన చేదు అనుభవాన్ని మొత్తం ఆ ఇంటర్వ్యూలో బయట పెట్టారు.


Published Jul 05, 2024 08:40:46 PM
postImages/2024-07-05//1720192246_maruthi.png

న్యూస్ లైన్ డెస్క్: విభిన్న సినిమాలు తీస్తూ డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న మారుతి అంటే ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈయన ఇండస్ట్రీ లోకి రాకముందు బండ్లకు స్టిక్కర్లు వేస్తూ రోడ్డుమీద బొమ్మలు గీస్తూ ఉండేవారట. సమయం దొరికితే చాలు హైదరాబాదులోని ఎన్నో అందాలను గీసేవారు.అలాంటి మారుతికి బన్నీ వాసుతో స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని సినిమాలకు సహా నిర్మాతగా చేశారు.ఇక ఈయన ఇండస్ట్రీకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ రోజుల్లో మూవీతో. ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన బస్ స్టాప్ సినిమా మంచి హిట్ అయింది.

ఇక ఈయన బాబు బంగారం, బ్రాండ్ బాబులు, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు,శైలజ రెడ్డి అల్లుడు, ప్రతిరోజు పండగే,కొత్త జంట, లవర్స్, లవ్ యూ బంగారం, ప్రేమ కథ చిత్రం వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక ఈయన చివరిగా గోపీచంద్ హీరోగా చేసిన పక్కా కమర్షియల్ మూవీకి డైరెక్టర్ గా చేశారు.ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ది రాజా సాబ్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ మారుతి నయనతార గురించి సంచలన కామెంట్లు చేశారు.ఆయన మాట్లాడుతూ.. నేను బాబు బంగారం సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సమయంలో నయనతార చాలా తప్పుగా ప్రవర్తించింది.

ఆమె తన ఇష్టం ఉన్నప్పుడు షూటింగ్ సెట్ కి వచ్చి ఇబ్బంది పెట్టింది. అయితే నేను చిన్న డైరెక్టర్ కావడంతో ఆమె నన్ను లెక్క చేయలేదు. నన్ను మాత్రమే కాదు హీరో వెంకటేష్ ని కూడా అవమానించినట్లే..ఎందుకంటే అంత పెద్ద హీరో వెంకటేష్..కనీసం ఆయనకి విలువ ఇచ్చి సినిమా షూటింగ్ కి తొందరగా వచ్చి ఉంటే బాగుండేది.కానీ నయనతార మాత్రం మా అందరిని దారుణంగా అవమానించింది. అయితే నయనతార చేసే పనులు చూస్తూ ఊరుకోకుండా ఓ రోజు షూటింగ్  స్పాట్ లోనే నేను  గొడవ పెట్టుకున్నాను. ఆ కోపంతో క్లైమాక్స్ లో ఒక పాట షూటింగ్లో కూడా పాల్గొనలేదు.

దాంతో క్లైమాక్స్ లో పాట లేకుండానే సినిమాని రిలీజ్ చేసేసాం అంటూ డైరెక్టర్ మారుతి నయనతారతో తనకి ఎదురైన చేదు అనుభవాన్ని మొత్తం ఆ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. దీంతో మారుతి మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ నయనతారకి మరీ అంత పొగరా..చిన్న దర్శకులు అయితే ఏంటి పెద్ద దర్శకులు అయితే ఏంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమాలు చేస్తుందా.. అంత ఫ్రౌడ్ గా ఎందుకు బిహేవ్ చేస్తుంది. కనీస మర్యాద అయిన ఇవ్వాలి కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu venkatesh maruthi nayanthara babu-bangaram-movie

Related Articles