Ponnam: విద్యుత్ శాఖ అధికారులపై మంత్రి పొన్నం సీరియస్

సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలోని విద్యుత్ శాఖ అధికారుల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Published Aug 21, 2024 09:45:32 PM
postImages/2024-08-21/1724256932_ponnam2.PNG

న్యూస్ లైన్ డెస్క్: సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలోని విద్యుత్ శాఖ అధికారుల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గౌరారంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి మంత్రి పొన్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి విద్యుత్ అంతరాయం కలిగిస్తున్నారని, సమస్య పరిష్కారించాలని మంత్రి పొన్నంకు రైతులు విజ్ఞప్తి చేశారు. 

వ్యవసాయానికి కరెంటు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. నెల రోజులుగా వ్యవసాయానికి అందించిన లెక్కలను చూపాలంటూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి పొన్నం ఆదేశించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. 

newsline-whatsapp-channel
Tags : telangana minister farmers ponnam-prabhakar currentofficers

Related Articles