ప్రతిష్టాత్మక అవార్డు అయిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారానికి నలిమెల భాస్కర్ ఎంపికయ్యారు.
న్యూస్ లైన్ డెస్క్: పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు 2024 సంవత్సరానికిగాను ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్ ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ అవార్డు ఎంపిక కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, కమిటీ కన్వీనర్ సమావేశమై ప్రతిష్టాత్మక ప్రజా కవి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం 2024కు కమిటీ సిఫార్సు చేసిన పేరును పంపించారు.
ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి "శ్రీ నలిమెల భాస్కర్ పేరును ఆమోదించడం జరిగింది. ఈ అవార్డు కింద రూ. 1,01,116 నగదు, జ్జాపిక అందించి శాలువతో సత్కరిస్తారు. కాళోజీ అవార్డుకు ఎంపికైన నలిమెల భాస్కర్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.