JIO: దివాళి ఆఫర్ ప్రకటించిన జియో..ఫ్రీ 5జీ !

అన్ని జియో సంస్థల షాపింగ్ మాల్ప్ కు కస్టమర్లను అట్రాక్ట్ చెయ్యడానికి ఆఫర్ ప్రకటించింది.


Published Sep 18, 2024 10:57:00 PM
postImages/2024-09-18/1726680484_jiodiwalioffer.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వినాయకచవితతి అయిపోయింది...దసరా ..దివాళి లైన్లో ఉన్నాయి. జియో దివాళి ఆఫర్ ప్రకటించింది.ఆన్ లైన్ , ఆఫ్ లైన్ షాపింగ్ మాల్స్ కు గిరాకీ పెరిగింది. అన్ని జియో సంస్థల షాపింగ్ మాల్ప్ కు కస్టమర్లను అట్రాక్ట్ చెయ్యడానికి ఆఫర్ ప్రకటించింది.


రిలయన్స్ జియో తాజాగా తమ వినియోగదారులకు దీపావళి ధమాకా ఆఫర్ ను ప్రకటించింది. ముఖ్యంగా తమ యూజర్లకు ఏడాది పాటు ఉచితంగా జియో ఎయిర్ ఫైబర్ సేవలను, ఏడాది పాటు వార్షిక మొబైల్ రీచార్జిని అందించనుంది. పైగా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించే సదుపాయం కలిగిస్తుంది. అయితే ఈ ఆఫర్ నేటి నుంచి అనగా సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 3 వరకు మాత్రమే . కాని ఆఫర్ రావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి.


ఏదైనా రిలయన్స్ డిజిటల్, మై జీయో స్టోర్ లో రూ.20 వేల కంటే ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తే ఈ ఆఫర్ వస్తుంది. పైగా ఏడాది పాటు ఉచితంగా ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌ అందుకుంటారు. అలాగే ఇప్పటికే జియో ఎయిర్ ఫైబర్ వినియోగిస్తున్న కస్టమర్లు రూ.2,222తో మూడు నెలల దీపావళి ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఈ ఆఫర్ కు అర్హులవుతారు. ఈ ఆఫర్ గురించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ తమసంస్థల్లో ఉండే అధికారులు తెలిపుతారని అన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : offers ai-technology jio

Related Articles