pallavi prasanth: రైతుబిడ్డ ఇచ్చిన మాట మర్చిపోయాడా..ఏమైపోయాయి బిగ్ బాస్ మాటలు

తన 100 పర్సంట్ అఫర్ట్స్ పెట్టాడు. టైటిల్ కొట్టేటపుడు మాత్రం తనకు వచ్చిన ప్రైజ్ మనీ అంతా ఎంతో కష్టపడుతున్న రైతులకు ఇస్తాననన్నాడు


Published Aug 01, 2024 01:00:02 AM
postImages/2024-08-01/1722491969_pallaviprashanth1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  పల్లవి ప్రశాంత్ ...లాస్ సీజన్ లో ఈ పేరు మారుమోగిపోయింది. కాస్త ఓవర్ చేసినా.టైటిల్ కోసం కష్టపడ్డాడు. తన 100 పర్సంట్ అఫర్ట్స్ పెట్టాడు. టైటిల్ కొట్టేటపుడు మాత్రం తనకు వచ్చిన ప్రైజ్ మనీ అంతా ఎంతో కష్టపడుతున్న రైతులకు ఇస్తాననన్నాడు. మళ్లీ బిగ్ బాస్ సీజన్ వచ్చేస్తుంది అన్న మాత్రం అస్సలు చెప్పింది మాత్రం చెయ్యలేదు.


కాగా పల్లవి ప్రశాంత్ గెలుపుకు దోహదం చేసిన అంశాల్లో మరొకటి.. అతడు ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని హామీ ఇవ్వడం. కంటెస్టెంట్స్ అందరూ ప్రైజ్ మనీ తమ సొంత ప్రయోజనాలకు, కొంత ఛారిటీకి వాడతామని చెప్పారు. పల్లవి ప్రశాంత్ మాత్రం మొత్తం రూ. 50 లక్షలు పేద రైతులకు పంచుతానని అన్నాడుఫైనల్ లో ప్రిన్స్ యావర్ నాలుగో స్థానం వద్ద రేసు నుండి తప్పుకున్నాడు. కాని సార్ కి ఆ మాటే గుర్తులేదు. వచ్చినపుడు ప్రశాంత్ కి ఇప్పటి ప్రశాంత్ కి చాలా తేడా వచ్చేసింది. 


ప్రశాంత్ కి ఎంత మనీ వచ్చిందంటే.. ప్రిన్స్ యావర్  నాగార్జున ఆఫర్ చేసిన రూ. 15 లక్షలు ఇచ్చేయగా ...పల్లవి ప్రశాంత్ కి రూ. 35 లక్షలు ప్రైజ్ మనీ వచ్చింది. ఒక కారు, డైమండ్ నెక్లెస్ బహుమతులు వచ్చాయి. వాటి విలువ రూ. 30 లక్షలు. ప్రైజ్ మనీగా వచ్చిన రూ. 35 లక్షల్లో ట్యాక్స్ కటింగ్ పోను రూ. 16 లక్షలు పల్లవి ప్రశాంత్ కి వచ్చాయని టాక్.

 
రైతులకు 16 లక్షలు రైతులకు ఇవ్వాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 7 ముగిసి ఏడు నెలలు అవుతుంది. ఒక్క లక్ష రూపాయలు మాత్రమే పల్లవి ప్రశాంత్ దానం చేశాడు. అంతేనా సాయం చేస్తానన్న మాట మర్చిపోయాడు...వ్యవసాయం మరిచిపోయాడు. అన్న సూట్ బూట్ లోకి మారి హైదరాబాద్ లో జల్సాలు చేస్తున్నాడు. 


సోషల్ మీడియా ఆదాయం, ఇతర ప్రమోషన్స్ వలన వచ్చే సంపాదనతో హ్యాపీగా బ్రతికేస్తున్నాడట. సెలెబ్రిటీ హోదా అనుభవిస్తున్న పల్లవి ప్రశాంత్ ...షాపు ఓపెనింగ్స్ ...చిన్న చిన్న బ్రాండ్లకు ప్రమోషన్స్ చేస్తూ గట్టిగా సంపాదిస్తున్నాడు కాని ఇచ్చిన మాట మాత్రం మరిచిపోయాడు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu big-boss7 pallavi-prashanth

Related Articles