Gold: వామ్మో... బస్సులో ఎంత బంగారమో..!

సంగారెడ్డి జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా బంగారం పట్టుకున్నారు.


Published Aug 06, 2024 06:24:54 AM
postImages/2024-08-06/1722943356_gold2.PNG

న్యూస్ లైన్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా బంగారం పట్టుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్నఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 4.8 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారు నగలకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు బంగారాన్ని సీజ్ చేశారు. మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం కమ్ కోల్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ వాహనాల తనిఖీల్లో బంగారం పట్టుబడ్డింది. బంగారం బ్యాగుతో పట్టుబడిన వ్యక్తిని సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

newsline-whatsapp-channel
Tags : telangana police district-news gold

Related Articles