Rambha: కన్నతండ్రికి భయపడి మెట్ల కింద దాక్కున్న రంభ.. కారణం ఇదే.!

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని తన అంద చందాలతో, నటన అభినయంతో ఊపు ఊపింది రంభ. వెంకటేష్, బాలకృష్ణ,చిరంజీవి, తరం హీరోలు అందరితో నటించింది. అలా రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్ కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ, తమిళ, హిందీ, ఇండస్ట్రీల్లో కూడా తన జోరు కొనసాగించింది. అలాంటి రంభ స్పెషల్ సాంగ్ సినిమాలో ఉందంటే తప్పనిసరిగా ఆ మూవీ సూపర్ హిట్ అయ్యేది. అంతటి పర్ఫామెన్స్ చూపెట్టిన రంభ,  ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది.  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన నిజజీవితంలో  ఏర్పడిన కొన్ని సంఘటనల గురించి చెబుతూ బాధపడింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-20/1721460846_rambha.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని తన అంద చందాలతో, నటన అభినయంతో ఊపు ఊపింది రంభ. వెంకటేష్, బాలకృష్ణ,చిరంజీవి, తరం హీరోలు అందరితో నటించింది. అలా రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్ కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ, తమిళ, హిందీ, ఇండస్ట్రీల్లో కూడా తన జోరు కొనసాగించింది. దక్షిణాదిలో  ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఏడాదిలో తక్కువలో తక్కువ పది సినిమాలకు పైగానే చేసేది.

అలా సినిమాలో హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్  కూడా చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి రంభ స్పెషల్ సాంగ్ సినిమాలో ఉందంటే తప్పనిసరిగా ఆ మూవీ సూపర్ హిట్ అయ్యేది. అంతటి పర్ఫామెన్స్ చూపెట్టిన రంభ,  ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది.  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన నిజజీవితంలో  ఏర్పడిన కొన్ని సంఘటనల గురించి చెబుతూ బాధపడింది.

రంభ చాలా మొండి పట్టుదలతో ఉంటుందట. ఎవరు ఏ మాట అన్నా అస్సలు తగ్గదట.  ఇక వారితో ఎన్ని రోజులైనా మాట్లాడకుండా ఉంటుందట.  ఆ విధంగా తన తండ్రి ఓ సారి తిట్టాడని మెట్ల కింద దాక్కొని ఒకరోజు మొత్తం అక్కడే గడిపిందట. చివరికి తన తండ్రి అంతటా వెతికి, మెట్ల కింద చూసేసరికి అక్కడ ఉందట. ఆయన అక్కడికి వచ్చి సారీ చెప్పి  తీసుకెళ్లే వరకు అక్కడే ఉన్నానని  తెలియజేసింది.

అంతే కాదు ఒక సందర్భంలో మా నాన్న కోప్పడ్డాడని ఆయనతో ఆరు నెలల వరకు మాట్లాడలేదని, ఆయనను టార్చర్ పెట్టాను అని తెలియజేసింది. కానీ ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఆ టైంలో నాన్న ఎంత బాధపడి ఉంటారో అని ఆమె ఎమోషనల్ అయింది. ఆమె అప్పట్లో చెప్పిన మాటలు ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu venkatesh balakrishna ramba

Related Articles