Assembly: రేవంత్ గురించి సంచలన విషయం చెప్పిన సబితా ఇంద్రారెడ్డి

ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలరంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన సబితా.. తనను ఎద్దేశించే రేవంత్ ఆ మాటలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Published Jul 31, 2024 02:59:44 AM
postImages/2024-07-31/1722412772_sabitha.jpg

న్యూస్ లైన్ డెస్క్: బుధవారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించానని ఆమె అన్నారు. 

వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలరంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన సబితా.. తనను ఎద్దేశించే రేవంత్ ఆ మాటలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం తనను టార్గెట్ చేసారని ఆమె మండిపడ్డారు.  రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఎందుకని ఆమె ప్రశ్నించారు. సీఎం ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి, నా ఇంటి మీద వాలితే కాల్చి చంపేస్తామని రేవంత్ అన్నారని ఆమె వెల్లడించారు. రేవంత్ రెడ్డి పార్టీలోకి వస్తే అహ్వాహించానని, గొప్ప స్థాయికి వెళ్తారని చెప్పానని ఆమె గుర్తుచేశారు. సీఎం అవుతారని కూడా చెప్పినట్లు ఆమె వెల్లడించారు. 

newsline-whatsapp-channel
Tags : ts-news revanth-reddy news-line newslinetelugu congress congress-government sabithaindrareddy telanganaassembly mlasabithaindrareddy malasabitha

Related Articles