saipallavi: సాయిపల్లవికి అన్యాయం జరిగిందంటున్న ఫ్యాన్స్

నిత్యకు అవార్డు రావడంపై సాయిపల్లవి ఫ్యాన్స్ అంత హ్యాపీ గా లేరు.  మా హీరోయిన్ కు రావాల్సిన అవార్డు నిత్యకు వచ్చేసిందంటు తెగ ఫీలయిపోయారు


Published Aug 17, 2024 11:58:00 AM
postImages/2024-08-17/1723876166_processaws.webp

 న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చాలా మంది యాక్టర్లు ఉంటారు..కొందరు మాత్రమే నటులు కాగలరు. ఏ పాత్ర అయినా ..మంచినీరులా మారి ఆ పాత్రలో ఒదిగిపోతారు. అలాంటి యాక్టర్స్ లో సాయిపల్లవి. నిత్యామీనన్ ఇద్దరు ఇద్దరే. కచ్ ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించిన మాన్సీ పరేఖ్ తో పాటు తిరు సినిమాకు గానూ నిత్యా మీనన్ కు ఇద్దరికీ జాతీయ ఉత్తమనటి పురస్కారం దక్కింది. ఓ మంచినటికి జాతీయ అవార్డు రావడం హ్యాపీనే కదా...కాని సాయిపల్లవి ఫ్యాన్స్ కు మాత్రం తెగ కోపం తెప్పించింది. ఇప్పుడు నిత్యకు అవార్డు వచ్చింది. కాని సాయిపల్లవికి రావాలి..గార్గి సినిమా చాలా అధ్భుతంగా ఉంటుంది.


అప్పుడు ఆ సినిమాకు అవార్డులు రాలేదు కాని ఇఫ్పుడు నిత్యకు అవార్డు రావడంపై సాయిపల్లవి ఫ్యాన్స్ అంత హ్యాపీ గా లేరు.  మా హీరోయిన్ కు రావాల్సిన అవార్డు నిత్యకు వచ్చేసిందంటు తెగ ఫీలయిపోయారు.


నిత్య ..బెంగుళూరు అమ్మాయి 36వయస్సు వచ్చేసరికి దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీలోనూ తన సత్తా ఏంటో చాటింది. యాక్టింగ్ తో పాటు సింగర్ గా, ప్రొడ్యూసర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా అబ్బో నిత్య అడుగుపెట్టింది.  అన్ని ఫీల్డ్ లోను నిత్య తన మార్క్ చూపించుకుంది . జాతీయ ఉత్తమనటి పురస్కారం దక్కింది. నిత్యామీనన్ రెండు నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలను కైవసం చేసుకుంది.  ఖాతాలో ఇప్పుడు జాతీయ అవార్డు కూడా వచ్చి చేరింది.


సాయిపల్లవికి సేమ్ లైన్ లో గార్గి పడింది. కాని గార్గికి అవార్డు లేవు. సాయిపల్లవి ఆ సినిమాలో యాక్టింగ్ చంపేసింది. అత్యాచార కేసులో అరెస్ట్ అయిన తండ్రిని విడిపించడం కోసం కుమార్తె పడుతున్న కష్టం చూసి చలించేలా చేశారు. అత్యాచారానికి గురైన చిన్నారి తండ్రి బాధను ఫీలయ్యేలా చేశారు. కోర్టుకు ఆధారాలే కావాలి. ఎక్కడా లాజిక్స్ మిస్ కాకుండా ...అత్యాచార బాధితురాలిని , తన తండ్రిని చూస్తూ కూతురు పడే కష్టం అన్ని యాంగిల్స్ లోను గార్గి బాల్యాన్ని , వర్తమానాన్ని చూపించిన తీరు ..స్క్రీన్ ప్లే బావుంది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nithya-menen national-film-awards

Related Articles