రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం..!

నటుడు, కమెడియన్ రాజేంద్రప్రసాద్ అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు.  ఆయన హీరోగా కమెడియన్ గా  ఇలా ఎన్నో పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.


Published Oct 05, 2024 09:20:07 AM
postImages/2024-10-05/1728100207_RAJENDRA.jpg

న్యూస్ లైన్ డెస్క్: నటుడు, కమెడియన్ రాజేంద్రప్రసాద్ అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు.  ఆయన హీరోగా కమెడియన్ గా  ఇలా ఎన్నో పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.  అలాంటి రాజేంద్రప్రసాద్ కూతురు గద్దె గాయత్రి (38) తాజాగా గుండెపోటుతో చనిపోయింది. ఆమెకు శుక్రవారం సడన్ గా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజి హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

చివరికి ఆమె చికిత్స పొందుతూ మరణం పొందింది. అయితే రాజేంద్రప్రసాద్ కు ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నారు. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే గాయత్రి అంత్యక్రియలను అక్టోబర్ ఆరవ తేదీన ఆదివారం జరుపుకున్నారు.  అయితే రాజేంద్రప్రసాద్ కూతురు ఆకస్మాత్తుగా మరణించడంతో సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు సంఘీభావం తెలియజేస్తున్నారు.

అయితే రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి  పోషకాహార నిపుణురాలిగా పనిచేసేది. ఆమె మరణంతో రాజేంద్రప్రసాద్ తన కూతురు గురించి ఒక సినిమా ప్రమోషన్ సందర్భంగా గుర్తు చేసుకున్న వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood heart-attack rajendraprasad died dadde-gayatri

Related Articles