పీఎం  మోడీని కూడా వదలని వరలక్ష్మి శరత్ కుమార్.! 2024-06-30 14:43:45

న్యూస్ లైన్ డెస్క్: ఇండియన్ ఫిమేల్ యాక్టర్స్ లో  అత్యంత గుర్తింపుతో దూసుకుపోతున్నటువంటి నటిమని వరలక్ష్మి శరత్ కుమార్. ఈ యాక్టర్ లేటు వయసులో  పెళ్లికి సిద్ధమైంది.  ముంబైకి చెందినటువంటి ఆర్ట్ గ్యాలరీ నడిపిస్తున్న నికోలై సచ్ దేవునిని పెళ్లి చేసుకోబోతోంది. గత రెండు నెలల క్రితమే సచ్ దేవ్  ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని సైలెంట్ గా పూర్తి చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్  తన పెళ్లి కూడా త్వరలోనే చేసుకోబోతోంది.

 ఇదే తరుణంలో తనకు సంబంధించినటువంటి ఆహ్వానాన్ని దేశమంతా తిరుగుతూ ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులకు  ఇన్విటేషన్ అందిస్తోంది.  ఇప్పటికే ఆమె తమిళనాడు సీఎం స్టాలిన్, కోలీవుడ్ స్టార్ హీరోస్ అయినటువంటి సూర్య, రజనీకాంత్, నయనతార, వంటి ఎందరో స్టార్ హీరో హీరోయిన్లకు ఆహ్వానం అందించింది.

 తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, నరేంద్ర మోడీలకు ఆమె ఆహ్వాన పత్రికను అందించింది. అలాంటి వరలక్ష్మీ శరత్ కుమార్ చివరికి పీఎం మోడీని కూడా వదలకుండా తన వివాహ కార్డును అందిస్తూ వివాహానికి రమ్మని ఆహ్వానం పలికింది. ఈమె గత నెల రోజులుగా తన ఆహ్వాన పత్రికలను పట్టుకొని  దేశంలోని చాలామంది ప్రముఖులకు అందించింది.  వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పెళ్లికి రమ్మని ఆహ్వానం పలకడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వరలక్ష్మి  తల్లిదండ్రులు ఇద్దరు బిజెపి పార్టీలో కీలకంగా ఉన్నారు.  అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ వివాహానికి హాజరుకావాలని  ఆహ్వానాన్ని అందించారు.