VenuSwamy:బిగ్ బాస్ లోకి వేణు స్వామి..రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మతిరుగుద్ది.!

Published 2024-07-04 20:17:56

postImages/2024-07-04/1720104476_venu.jpg

న్యూస్ లైన్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో  జ్యోతిష్య నిపుణుడిగా పేరుపొందిన వేణు స్వామి అంటే తెలియని వారు ఉండరు. సినీ నటుల, రాజకీయ నాయకుల, జాతకాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయినటువంటి వేణు స్వామి రెండు చేతుల సంపాదిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లకు పూజలు చేసి వారి కెరియర్ గాడిలో పెట్టారని ఒక రూమర్ కూడా ఉంది.  అలా వేణు స్వామి పూజలు,  హీరో హీరోయిన్ల, దిష్టి దోషాలు, ఇలా ఎన్నో చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు.  అంతే కాకుండా వేణు స్వామి ఇండస్ట్రీలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు త్వరలోనే చనిపోతున్నారని చెప్పారు.

ఆయన చెప్పినట్టుగానే కొంతమంది ప్రముఖులు చనిపోయారు. ఒక్కోసారి వేణు స్వామి చెప్పింది కరెక్ట్ అయితే, ఒక్కోసారి రాంగ్ అవుతుంది. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైసిపి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు సీఎం అవుతారని చెప్పారు.  కానీ ఆయన అంచనాలు తలకిందులై టిడిపి కూటమి అద్భుత మెజారిటీతో గెలిచింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గెలుస్తారని చెప్పారు  అది కూడా బోల్తా కొట్టి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.  దీంతో భయపడిపోయిన వేణు స్వామి ఇక నేను జాతకాలు చెప్పనంటూ సోషల్ మీడియా వేదికగా తన తప్పును ఒప్పుకున్నాడు.  

అయితే ఈ విధంగా జాతకాలు చెప్పే వేణు స్వామి గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఆయన బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సీజన్ గురించి కంటెస్టెంట్ల గురించి వార్తలు వస్తున్నాయి.  ఇదే తరుణంలో వేణు స్వామి కూడా సీజన్ 8 లోకి ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంతో, అబద్ధం ఏమిటో తెలియదు కానీ ఆయనకు ఈ సీజన్ లో అత్యధిక రెమ్యునరేషన్ ఇస్తున్నారట.  మరి ఇలా జాతకాలు చెప్పుకొని ఎంతో సంపాదించే వేణు స్వామి అలా నాలుగు గోడల మధ్య సినీ నటుల మధ్య ఉండగలుగుతారా అనేది  చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఉన్న ఆయన కొన్ని వారాలపాటు మాత్రమే కొనసాగలుగుతారు తప్ప ఎక్కువ రోజులు ఉండలేరని అంటున్నారు.

ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నాగార్జున చెప్పే మాటలు వినాలి, బిగ్బాస్ నిబంధన ప్రకారం మెదులుకోవాలి. కానీ వేణు స్వామి చెప్పేది అందరు వినాలి అని ఆయన అనుకుంటారు.  ఆయన నాగార్జున చెప్పేది బిగ్ బాస్ నిబంధన ప్రకారం ఉండగలుగుతారా లేదా అనేది ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం. వీళ్లే కాకుండా కుమారి ఆంటీ, బర్రెలక్కా వంటి వ్యక్తులు కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.