Journalist: అప్పుడు రేవంత్ బ్రదర్స్‌పై విమర్శలు.. ఇప్పడు వాళ్లతోనే చెట్టాపట్టాలు

 ఇతరుల పేరున ఉన్న భూమిని కబ్జా చేశారని ఆరోపణలు చేశారు. మొత్తం 6 సర్వే నుంబర్లతో ఉన్న భూమిని అక్రమంగా తమ పేరుకు మార్చుకున్నట్లు విజయ్ ఆధారాలను చూపించారు. 
 


Published Aug 13, 2024 11:46:46 AM
postImages/2024-08-13/1723529806_vijay.jpg

న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డిపై గతంలో విమర్శలు చేసిన ఓ జర్నలిస్ట్.. ఇప్పుడు వాళ్లతోనే విదేశీ పర్యటనకు వెళ్లాడు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ భూకబ్జాలకు పాల్పడ్డారని జర్నలిస్ట్ విజయ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించినట్లు వెల్లడించారు. ఇతరుల పేరున ఉన్న భూమిని కబ్జా చేశారని ఆరోపణలు చేశారు. మొత్తం 6 సర్వే నుంబర్లతో ఉన్న భూమిని అక్రమంగా తమ పేరుకు మార్చుకున్నట్లు విజయ్ ఆధారాలను చూపించారు. 

అయితే, ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, సౌత్ కొరియా పర్యటనల్లో బిజీగా ఉండగా.. మరోవైపు ఆయన సోదరుడు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. తాజగా, కొండల్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో జర్నలిస్ట్ విజయ్ కనిపించడంతో.. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. 

గతంలో భూకబ్జాలు,  భూదందాలు అంటూ అనుముల బ్రదర్స్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. ఇప్పడు కొండల్ రెడ్డి అమెరికా పర్యటనలో ప్రత్యక్షం అయ్యారు. అయితే, గతంలో పని చేసిన మీడియా ఛానల్ నుంచి విజయ్ మరో ఛానల్‌లో చేరినట్లు సమాచారం. ఇది టీడీపీకి సంబంధించిన ఛానల్ కావడంతో.. గురుశిష్యులు పెద్ద కుంభకోణం చేయనున్నారని చర్చలు జోరుగా సాగుతున్నాయి. 

newsline-whatsapp-channel
Tags : telangana revanth-reddy news-line newslinetelugu telanganam cm-revanth-reddy journalist

Related Articles