KM. Pandu: కే.ఎం.పాండుకు వివేకానంద్ నివాళి

ఆయన ఆధ్వర్యంలో అనేకమంది ప్రజలకు సేవ చేయడాన్ని తెలుసుకొని అనేక పదవులలో తమదైన ముద్రను వేసుకున్నారన్నారు. విద్య ద్వారానే పేదరికాన్ని పోగొట్టవచ్చని నమ్మిన నేత పాండు అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల కోసం పని చేశానని ఆయన అన్నారు. 


Published Aug 17, 2024 05:54:11 PM
postImages/2024-08-17/1723897451_kmpandu.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈరోజు దివంగత నేత కే.ఎం.పాండు 79వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, ఖుత్బుల్లాపూర్ BRS ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సంధర్బంగా వివేకానంద్ మట్లాడుతూ.. పాండు చేసిన సేవలను కొనియాడారు. రాజకీయాలకతీతంగా అందరి అభివృద్ధిని, శ్రేయస్సును ఆకాంక్షించిన నేత కె.ఎం.పాండు అని అన్నారు.


ఆయన ఆధ్వర్యంలో అనేకమంది ప్రజలకు సేవ చేయడాన్ని తెలుసుకొని అనేక పదవులలో తమదైన ముద్రను వేసుకున్నారన్నారు. విద్య ద్వారానే పేదరికాన్ని పోగొట్టవచ్చని నమ్మిన నేత పాండు అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల కోసం పని చేశానని ఆయన అన్నారు. తనకు ఎన్నికలలో హ్యాట్రిక్ రికార్డును అందించిన కుత్బుల్లాపూర్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.  


ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బలవంత్ రెడ్డి, ఠాగూర్ రాజేంద్ర సింగ్,  సామల నర్సింహా రెడ్డి, పెద్ది మల్లేశం, మురళి గౌడ్, నరహరి గౌడ్, బిక్షపతి, నల్ల లింగం గౌడ్, నల్ల ప్రసాద్, ఆటో బలరాం, కుంట వేణు, నదీమ్ రాయ్, యేసు, ఇందిరా రెడ్డి, నార్లకంటి నాగేష్, దర్శన్ గౌడ్, లింగం గౌడ్, గ్రామ పెద్దలు, పాండు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam kmpandugoud

Related Articles