ఇలా చేశారంటే కోట్ల అప్పులైనా ఇట్టే తీరుతాయి.!

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు అప్పులతో సతమతమవుతూ ఉంటారు. ఎంత సంపాదించిన అప్పులు కట్టడానికే సరిపోతూ ఉంటుంది. అలా అప్పుల వల్ల  ఇబ్బందులు పడుతున్న వారికి


Published Sep 26, 2024 07:34:12 AM
postImages/2024-09-26/1727316252_salt.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు అప్పులతో సతమతమవుతూ ఉంటారు. ఎంత సంపాదించిన అప్పులు కట్టడానికే సరిపోతూ ఉంటుంది. అలా అప్పుల వల్ల  ఇబ్బందులు పడుతున్న వారికి  సరికొత్త  రెమిడి ఉంది. దీని ద్వారా కోట్ల అప్పులు ఉన్న ఇట్టే తీరిపోతాయి. అది ఎలాగో  ఇప్పుడు చూద్దాం..

ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది అవసరం అవుతుంది. దీని కోసం విపరీతంగా అప్పు చేయవలసి వస్తుంది. మరి ఆ అప్పు తెచ్చి వాటిని తీర్చడం కోసం చాలామంది అనేక ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది అప్పుల కోసం ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అలా ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంగా ఉండి అప్పులు తీర్చాలట.  అంతేకాకుండా అప్పు ఈజీగా తీరిపోవాలంటే గురువారం రోజున దొడ్డు ఉప్పును తీసుకోవాలి ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం.

 అయితే ఈ ఉప్పును గుప్పెట్లో పట్టుకొని దాన్ని నీళ్లలో పెట్టాలి. అలా ఉప్పంతా కరిగిపోయే వరకు అలాగే ఉండాలి. ఇలా నెలరోజులపాటు నాలుగు గురువారాలు చేయాలి. అలా మీ చేతిలో ఉన్న ఉప్పు ఏ విధంగా కరిగిపోతుందో మీ అప్పులు కూడా అలాగే కరిగిపోతాయట. అయితే ఈ రెమిడిని భార్య మరియు భర్త కలిసి చేస్తే ఫలితం తొందరగా ఉంటుందని  శాస్త్ర పండితులు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu astrology pooja laxmidevi big-salt debts

Related Articles