Hyderabad: హైదరాబాద్ నుంచి అయెధ్య రెండు గంటలే..జస్ట్ 4వేలరూపాయిలకే !

అయోధ్య వెళ్లాలంటే బై ట్రైన్ 30 గంటల ప్రయాణం . అదే ఫ్లైట్ లో అయితే జస్ట్ 4500 తో విమానంలో వెళ్లొచ్చు.


Published Oct 01, 2024 02:20:00 PM
postImages/2024-10-01/1727772666_FlightsFromHyderabadToA.jpg.webp


న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అయోధ్య వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక నుంచి హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లాలంటే 30 గంటల సుదీర్ఘ ప్రయాణంతో పని లేదు. కేవలం రెండున్నర గంటలతో మీరు అయోధ్య రాముని దర్శనం చేసుకోవచ్చు.  అది కూడా జస్ట్ రెండు గంటల్లోనే. ఇక పై హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లాలంటే బై ట్రైన్ 30 గంటల ప్రయాణం . అదే ఫ్లైట్ లో అయితే జస్ట్ 4500 తో విమానంలో వెళ్లొచ్చు.


హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు శుక్రవారం నుంచి వరుసగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల డిమాండ్ కారణం గా ఈ విమాన సర్వీసులు ఏర్పాటు చేశారు. అయితే ఈ విమాన సర్వీసులు సెప్టెంబర్ 27 నుంచి హైదరాబాద్ టూ అయోధ్య కు మధ్య వారానికి 4 రోజులు ఈ విమాన సర్వీసులు నడవనున్నాయి. హైదరాబాద్-ప్రయాగరాజ్, హైదరాబాద్-ఆగ్రా మధ్య వారానికి మూడు రోజులు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.


అయితే ఈ విమాన సర్వీసులు ప్రయాగరాజ్ , అయోధ్య కు వెళ్లే భక్తులు ఈ సర్వీసులు వినియోగించుకోవాలని కేంద్ర విమానయాన శాఖ సూచించింది. ఇప్పటికే అగర్తల, హైదరాబాద్ టూ జమ్ము విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. అయితే హైదరాబాద్ టూ అయోధ్య విమాన టికెట్టు 5 వేల రూపాయిల నుంచి మొదలవుతుంది. సౌత్ నుంచి వెళ్లే భక్తులకు ఇది చాలా మంచి అవకాశం .

newsline-whatsapp-channel
Tags : newslinetelugu hyderabad ayodhya flightservices

Related Articles