CHENNAI: చెన్నై మెరీనా బీచ్‌లో విషాదం- నలుగురు మృతి, 230మందికి గాయాలు !

తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్ లో ఎయిర్ షో లో అపశృతి జరిగింది. ఆ తొక్కిసలాటలో దాదాపు 230 మందికి గాయాలయ్యాయి.


Published Oct 06, 2024 10:07:00 PM
postImages/2024-10-06/1728232651_marinapti.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్ లో ఎయిర్ షో లో అపశృతి జరిగింది. ఆ తొక్కిసలాటలో దాదాపు 230 మందికి గాయాలయ్యాయి. నలుగురు చనిపోయారు కూడా. మృతులను శ్రీనివాసన్ , కార్తీకేయన్ , జాన్ బాబు, దినేశ్ గా అధికారులు గుర్తించారు. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం ఓ మెగా ఎయిర్ షోను ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి లక్షల్లో జనాలు మెరీనా బీచ్ కు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో దారుణమైన రద్దీ ..ఉక్కపోతతో పలువురు సొమ్మసిల్లిపడిపోయారు. 


మధ్యాహ్నం ఒంటిగంటకే ప్రదర్శన ముగిసినప్పటికీ సాయంత్రం వరకు ట్రాఫిక్‌ కొనసాగింది. చాలా మంది ఊపిరాడక కళ్లు తిరిగిపడిపోయారు. మెరీనా బీచ్‌ సమీపంలోని ..షో ముగిసిన అనంతరం తిరుగుప్రయాణం కోసం వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్‌లకు చేరుకోవడం వల్ల ప్లాట్‌ఫాంలపై నిలబడేందుకు కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అన్నా స్క్వేర్‌లోని బస్‌స్టాప్‌కు సందర్శకులు పోటెత్తారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu beachroad chennai boat-accident

Related Articles