TAMILNADU: తమిళనాడులో ఘోరం.. మరో నిర్భయ !

గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆతర్వాత ఆ అమ్మాయిని దిండిగల్ రైల్వేస్టేషన్ కు దగ్గరగా ఓ మూట గా కట్టి పడేశారు.


Published Sep 24, 2024 01:32:00 PM
postImages/2024-09-24/1727165143_raperapecase13372878516x90.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తమిళనాడులో మరో నిర్భయ ఘటన జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్ధినిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దిండిగల్ జిల్లా థేనిలో పట్టపగలే ఈ దారుణానికి దిగారు. కాలేజీ దగ్గరి నుంచి యువతిని ఎత్తుకెళ్లిన దుండగులు.. గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆతర్వాత ఆ అమ్మాయిని దిండిగల్ రైల్వేస్టేషన్ కు దగ్గరగా ఓ మూట గా కట్టి పడేశారు.చాలా సేపటి నుంచి గమనించిన స్థానికులు ఆ మూటని తీసి చూడగా అమ్మాయిని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  


పోలీసులు.. బాధితురాలిని దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పట్లో ఆమె పరిస్థితిని వివరించలేమని ...మరిన్ని వివరాలు రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే చెప్పగలమని అన్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు దిండిగల్ ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఈ దారుణానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tamilnadu nirbhayaofkolkata

Related Articles