Flight: ఫ్లైట్ ఎక్కాలని ఉందా..రూ:883 విమాన ప్రయాణం..! 2024-06-27 19:48:15

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది  మధ్య తరగతి ప్రజలకు విమానము ఎక్కాలని కోరిక ఉంటుంది. కానీ ఈ కోరిక తీరాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి విమానంలో ప్రయాణించేందుకు, వేయి రూపాయల లోపే టికెట్ రేటు ఉంది. స్పాష్ సేల్ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్లు మీరు ఉపయోగించుకోవాలంటే,  అప్లై చేసుకోవడానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది.

అప్లై చేసిన తర్వాత సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ ఆఫర్లు దేశంలోనే దిగ్గజ విమాన సంస్థ అయినటువంటి ఎయిర్ ఇండియా, ఎక్స్ప్రెస్ స్పెషల్ సేల్ పేరుతో తీసుకువచ్చింది. కేవలం 883 రూపాయలకే మన టికెట్లు అందిస్తున్నది. అయితే ఈ టికెట్లను కూడా రెండు రకాలుగా అందిస్తున్నది.  ఎక్స్ప్రెస్ లైట్ ఫెర్స్ పేరుతో టికెట్ల ధరను 1000లోపే ఉంచింది.. ఇందులో ఎలాంటి మధ్యవర్తిత్వం లేదు. ఇందులో రెండవ ఎక్స్ప్రెస్ వేల్యూ ఫెయిర్స్ టికెట్ల ధర  1096తో ప్రారంభమవుతుంది.

అయితే ఈ టికెట్లను బుక్ చేసుకుని ఎందుకు జూన్ 28వ తేదీ వరకు అవకాశం ఉంది.  బుక్ చేసుకున్న తర్వాత జూలై 1వ తేదీ సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. ఈ మూడు నెలల్లో  మీకు, నచ్చినటువంటి ప్లేస్ లోకి మీరు వెళ్ళవచ్చు. ఈ విధంగా తక్కువ ధరకే టికెట్లు బుక్ చేసుకుని  పేద మధ్యతరగతి ప్రజలు విమానం ఎక్కాలని కోరికను తీర్చుకోవచ్చు. పూర్తి వివరాల కోసం https://www.airindiaexpress.comలేదంటే మొబైల్ యాప్ ఉపయోగించాలని కంపెనీ తెలియజేసింది.