ఈ ఈవెంట్ కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ చేరుకోవడం తో పాసులు లేని వారు కూడా రావడం వల్ల తొక్కిసలాట జరిగింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విక్టరీ సంబరాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విక్టరీ సంబరాలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ చేరుకోవడం తో పాసులు లేని వారు కూడా రావడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పదకొండు మంది మరణించారు.
నిజానికి 17 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో ఆర్సీబీ ఛాంపియన్గా నిలవడం వల్ల ఈ విక్టరీని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది. ఈ క్రమంలో బెంగుళూరు నగరంలో బస్ పరేడ్ ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ ఈ వెంట్ కి ఫ్రీ పాసులు అందించున్నట్లు మేనేజ్ మెంట్ సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ ఈవెంట్ కు చాలా వరకు పాసులు లేని వాళ్లే వచ్చారు. గేట్ నెం18 వద్ద తొక్కిసలాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో 11మంది చనిపోయారు.మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ఈ పరిస్థితితో తీవ్ర ఆగ్రహానికి గురైన అభిమానులు స్టేడియం బయట ఓ కారు అద్దాలు ధ్వంసం చేశారు.