విమానం లో 242 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం . అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కూలింది. మేఘానిలోని గుజ్ సెల్ విమానాశ్రయ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో 110 మంది ఇప్పటికే మృతి చెందినట్లు సమాచారం. విమానం లో 242 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం . అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది.
కూలిన విమానంలో 10 మంది సిబ్బంది మొత్తం 242 మంది
కూలిన విమాన ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు
కూలిన విమాన ప్రయాణికుల్లో 53 మంది బ్రిటన్ జాతీయులు
ప్రయాణికుల్లో ఏడుగురు పోర్చుగీసు వారు, ఒక కెనడియన్
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్రూపానీ ఉన్నట్లు అనుమానం