Padi Kaushik reddy: రేవంత్ రెడ్డికి క్యారెక్టర్ లేదు

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో పార్టీ మారిన వారిని డిస్ క్వాలిఫై చేస్తున్నారు. కర్ణాటకలో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను రక్షించుకుంటున్నారు. 


Published Sep 09, 2024 03:18:55 PM
postImages/2024-09-09/1725875335_padikaushikreddy.jpg

న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి క్యారెక్టర్ లేదని BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల పార్టీల ఫిరాయింపులపై ఆయన స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో పార్టీ మారిన వారిని డిస్ క్వాలిఫై చేస్తున్నారు. కర్ణాటకలో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను రక్షించుకుంటున్నారు. 

కానీ, తెలంగాణ మాత్రం డబ్బులు ఇచ్చి మరీ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నారని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎలాగూ క్యారెక్టర్ లేదు. కనీసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయినా ఈ విషయంలో క్యారెక్టర్ నిలబెట్టుకోవాలని కౌశిక్ రెడ్డి సూచించారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy news-line newslinetelugu brs telangana-bhavan telanganam padi-koushik-reddy press-meet

Related Articles