యాంత్రికంగా మారిన ఆధునిక మానవ జీవితంలో శాంతి, సమాధానాలు తప్పనిసరి అవసరాలని ఆయన అన్నారు. సమాజాన్ని శాంతియుత మార్గంలో నడిపించడంలో బ్రహ్మ కుమారీస్ సంస్థ ఆశయాలకు దగ్గరగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్లో శాంతి సరోవర్ ఉండటం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మ కుమారీస్ శాంతి సరోవరం 20వ వార్షికోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. యాంత్రికంగా మారిన ఆధునిక మానవ జీవితంలో శాంతి, సమాధానాలు తప్పనిసరి అవసరాలని ఆయన అన్నారు. సమాజాన్ని శాంతియుత మార్గంలో నడిపించడంలో బ్రహ్మ కుమారీస్ సంస్థ ఆశయాలకు దగ్గరగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తెలిపారు.
రైతుల ఆత్మహత్యల్ని నివారించి, చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతుల రుణమాఫీకి రూ. 31వేల కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. యువత పెడదారులు పట్టకుండా, డ్రగ్స్ పేరు వింటేనే భయపడేలా నార్కోటిక్స్ టీమ్స్ ద్వారా మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని, ప్రముఖ పారిశ్రామికవేత్తల సారధ్యంలో ఈ యూనివర్సిటీ నడుస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.