Supreme Court : రేవంత్ నోటి తీట.. సుప్రీంకోర్ట్ పెట్టింది వాత


Published Sep 03, 2024 05:09:20 PM
postImages/2024-09-03/1725363560_SupremeCourtFiresOnRevanthReddyFualthLanguage.jpg

న్యూస్ లైన్ డెస్క్ :  లిక్కర్ పాలసీ కేసులో కవితకు బెయిల్ పై రేవంత్ రెడ్డి, ఆయన అనుచరగణం చేస్తున్న విమర్శలు వివాదాస్పదంగా మారాయి. దేశం రాజధానిలో కూర్చుని ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి విపక్ష నేత రాహుల్ గాంధీ స్పీచులిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న పనులతో పార్టీ పెద్దలు తలపట్టుకుంటున్నారట. రాహుల్ గాంధీ కష్టపడి సంపాదిస్తున్న పేరు.. రేవంత్ తీరుతో మంటగలుస్తోందని సీనియర్లు మదనపడుతున్నారట. గాంధీభవన్‌లో ఏ ఇద్దరు కలిసినా.. ఇదే చర్చ జరుగుతోందట. సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సామాన్య జనం నుంచి సుప్రీం కోర్టు వరకు అందరితో తిట్టించుకోవడం, మొట్టికాయలు వేయించుకోవడం పరిపాటిగా మారిపోయిందని అంటున్నారు. ఆయన సొంత అభిప్రాయాలు, అనాలోచిత నిర్ణయాలతో పార్టీ పరువు పోతోందని ఆవేదన చెందుతున్నారట సీనియర్లు.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇటీవల కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ లోని ఆయన వర్గం వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అవి సుప్రీం కోర్టును తప్పు పట్టేలా ఉండటంతో ఇప్పటికే ఓ సారి న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడడం ఏంటని చీవాట్లు పెట్టారు. దీంతో మీడియా సంస్థలు తన వ్యాఖ్యలను వక్రీకరించాయని రేవంత్ రెడ్డి ఓ ట్వీట్ వేసి చేతులు దులుపుకున్నారు. కానీ కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియాలో మాత్రం ఆ వ్యాఖ్యలు, పోస్టులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

సోమవారం ఓటుకు నోటు కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కవిత బెయిల్ పై కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించిన పోస్టులను కోర్టు ముందు పెట్టారు జగదీష్ రెడ్డి తరుపు న్యాయవాది. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, పార్టీ హ్యాండిల్స్‌లో... న్యాయవ్యవస్థను, కోర్టును, కోర్టు తీర్పులను ధిక్కరించేలా పోస్టులు పెడుతున్నారని చూపించారు. దీంతో కోర్టు మరోసారి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలని రేవంత్ తరుపు న్యాయవాదులను ఆదేశించింది. ఇది పార్టీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓవర్ కాన్ఫిడెన్స్, ఎవర్నీ లెక్క చేయకపోడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి.. అటు పార్టీకి చెడ్డ పేరు వస్తోందని సీనియర్లు గుస్సా అవుతున్నారట.

ఏదో ఒక్క విషయంలో అంటే సర్దుకుపోవచ్చు.. కానీ ప్రతీ విషయంలో ఆయన చేసిన పని పెంట అవుతుంటే ఎలా ఊరుకోవాలంటూ మండిపడుతున్నారట. పైగా తాను చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు తన భజన మీడియాతో తప్పుడు ప్రచారాలు చేయించుకుని మరో తప్పు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఓ వైపు కాంగ్రెస్ అధిష్టానం ఇదే లిక్కర్ కేసులో తమ కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సిసోడియాకు బెయిల్ వస్తే స్వాగతించింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసిన అభిషేక్ సింఘ్వీనే వాళ్లకు బెయిల్ ఇప్పించారు. అదే కేసులో కవితకు బెయిల్ వస్తే మాత్రం రేవంత్, ఆయన వర్గం నేతలు తప్పుపడుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పునే తప్పు పట్టడం ఏంటని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. పార్టీకి ఒక నియమం ఉంటుందని అది అందరూ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారట. సొంత ప్రయోజనం కోసం పార్టీ స్టాండ్ మార్చితే ఎలా అని రేవంత్ వ్యవహారంపై అసహనంతో ఉన్నారట. వ్యవహారాలు ఇలాగే కొనసాగితే పార్టీకి రాష్ట్రంలో ఎదురుదెబ్బ తప్పదనే ఆందోళనలో ఉన్నారట రాష్ట్ర కాంగ్రెస్ లోని రేవంత్ వ్యతిరేక వర్గం నేతలు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy newslinetelugu supremecourt tspolitics telanganam cm-revanth-reddy mlc-kavitha bail-petition latest-news news-updates telugu-news

Related Articles