TG Govt : సివిల్స్ పాసైతే రూ.లక్ష సాయం.. కాంగ్రెస్ సర్కార్ కొత్తపథకం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకం ప్రకటించింది. గతంలో ఇచ్చిన హామీలు, పథకాలు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అమలు కాకపోయినా.. తాజాగా మరో కొత్త పథకం తెరపైకి తెచ్చింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-20/1721468780_CivilsAbhayaHastham.jpg

న్యూస్ లైన్ డెస్క్ : సివిల్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం ప్రకటించింది. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అర్హులకు రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకాన్ని ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. సింగరేణి కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

సివిల్స్ అభయహస్తం అర్హతలివే

  • రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అర్హతలు
  • జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారై ఉండాలి.
  • తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణతులై ఉండాలి.
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో శాశ్వత ఉద్యోగులు అయి ఉండకూడదు.
  • గతంలో ఈ పథకం పొందిన వారు అనర్హులు
  • ఒక అభ్యర్థికి ఒకసారి మాత్రమే ఈ పథకం ద్వారా ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు.

కాగా.. దేశవ్యాప్తంగా దాదాపు 14 లక్షల మంది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాస్తున్నారు. ప్రతి ఏడాది సుమారు 50వేల మంది సివిల్స్ ప్రిలిమ్స్ కి దరఖాస్తు చేస్తున్నారు. కాగా.. వీరిలో 400 నుంచి 500 మంది మాత్రమే అర్హత సాధిస్తున్నారు. కాగా.. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం సివిల్స్ అర్హులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. అయితే.. ఈ పథకమైనా అమలు చేస్తారా? లేక గత హామీల్లాగే పక్కకు పెడతారా అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నియి.

newsline-whatsapp-channel
Tags : ts-news revanth-reddy cm-revanth-reddy telangana-government mahalakshmi-scheme

Related Articles