రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం అసెంబ్లీ వేదికగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశామని, సీనియర్ అధికారులతో రెండు కమిటీలు వేశామన్నారు. 563 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని, కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని పోటీ పరీక్షల వరుస తేదీలతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరీక్ష సరిగా నిర్వహించలేని కారణంగా రెండుసార్లు గ్రూప్-1 రద్దయిందని భట్టి పేర్కొన్నారు.