HYDERABAD MURDER: పోలీసులకు చెప్పినా ప‌ట్టించుకోలే

హైద‌రాబాద్ బేగంపేట‌లో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దారుణం చోటు చేసుకుంది. పాటిగడ్డ ప్రాంతానికి చెందిన‌ ఉస్మాన్‌ అనే యువకుడు త‌న మ‌ర‌దలిని ప్రేమిస్తున్నాడని ఆమె బావ అజాజ్‌తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఉస్మాన్‌ హత్యకు ప్లాన్‌ వేశాడు. నలుగురు మాటువేసి ఉస్మాన్‌ను కత్తులతో పొడిచిచంపారు.


Published Jun 26, 2024 03:33:20 PM
postImages/2024-06-26/1719396200_Untitleddesign1.jpg

హైద‌రాబాద్ బేగంపేట‌లో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దారుణం చోటు చేసుకుంది. పాటిగడ్డ ప్రాంతానికి చెందిన‌ ఉస్మాన్‌ అనే యువకుడు త‌న మ‌ర‌దలిని ప్రేమిస్తున్నాడని ఆమె బావ అజాజ్‌తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఉస్మాన్‌ హత్యకు ప్లాన్‌ వేశాడు. నలుగురు మాటువేసి ఉస్మాన్‌ను కత్తులతో పొడిచిచంపారు.

హత్య అనంతరం అజాజ్‌ తన స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్ లో లొంగి పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు యువకులను విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనపై మృతుడి సోద‌రి మీడియాతో మాట్లాడారు. ఉస్మాన్ ని హత్య చేస్తామ‌ని కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని పోలీసులకు ముందే స‌మాచారం ఇచ్చామ‌ని ఆవేదన వ్య‌క్తం చేసింది.

పోలీసులు పట్టించుకోక‌పోవడం వ‌ల్ల‌నే ఉస్మాన్ హ‌త్య జ‌రిగింద‌ని స్థానికులు సైతం ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవ‌ల హైద‌రాబాద్ లో దారుణాలు పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. రోజుకు రెండు మూడు హ‌త్య‌లు, దాడులు జ‌ర‌గ‌డం న‌గ‌ర‌వాసుల‌ను ఆందోళ‌ను గురిచేస్తోంది. దీంతో కాంగ్రెస్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 
 

newsline-whatsapp-channel
Tags : hyderabad cm-revanth-reddy -police-

Related Articles