KCR: మీ అభిమానానికి థాంక్స్

Published 2024-07-03 21:01:06

postImages/2024-07-03//1720020666_manythankstokcrhugefan.jpeg

న్యూస్ లైన్ డెస్క్: బుధవారం నాడు ఎర్రవల్లి నివాసంలో తనను కలిసేందుకు మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుండి వచ్చిన కార్య కార్యకర్తలు నాయకులతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. తన పట్ల తెలంగాణ సమాజం చూపుతున్న ప్రేమాభిమానాలకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే తనను కలిసేందుకు ముందస్తు సమాచారంతో మాత్రమే రావాలని మరోసారి కార్యకర్తలకు అభిమానులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘‘నన్ను కలుద్దానికి పిలిచినోళ్లు పిలవనోళ్లు వేలమంది వస్తున్నరు రోజు. మీ అభిమానానికి థాంక్స్. అయితే అంతమందికి ఐదారు గంటలపాటు నిలబడి ఫోటోలు దిగాల్నంటే కాలిరిగిన నాకూ ఇబ్బందే అయితున్నది. ఒక్క మనిషి వేలమందితోని నిలబడి ఫోటోలు దిగితే ఎంత కష్టమో మీరే చెప్పండి. అందుకే సందర్శకులను ముందస్తు సమాచారం మేరకు మాత్రమే ఆహ్వానించాలనుకున్నాం. వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు చెప్తం. చెప్పిన వాళ్లు మాత్రమే వస్తే లొల్లి లేకుంట వాళ్లతో కడుపునిండ మాట్లాడుకొని పంపియ్యొచ్చు. మీరు నా మీద ఇంతగా చూపిస్తున్న అభిమానానికి మరోసారి మీకు పేరు పేరునా ధన్యవాదాలు’’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.