Goa tourism: సికింద్రాబాద్ నుండి గోవాకు స్పెషల్ ట్రైన్.. డిటైల్స్ ఇవ్వే..!

హైదరాబాద్ నుండి గోవాకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌‌కు లేఖ రాశారు. కాగా, మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆపేసింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ముగియడంతో మరోసారి ఈ ప్రతిపాదనను పరిశీలించిన రైల్వే శాఖ కొత్త రైలును మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 


Published Jul 06, 2024 07:40:33 AM
postImages/2024-07-06/1720269528_modi40.jpg

న్యూస్ లైన్ డెస్క్: త్వరలోనే సికింద్రాబాద్ నుండి గోవాకు స్పెషల్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుండి బయలుదేరే ఒక రైలు గుంతకల్‌కు చేరుకొని తిరుపతి మీదుగా గోవాకు వెళ్లే మరో 10 కోచ్‌లను కలుపుకొని గోవాకు ప్రయాణం సాగించేది. అయితే, ఈ ట్రైన్ మాత్రమే కాకుండా కాచీగూడ-యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్‌లను కలిపేవారు. 

అయితే, ఇలా రైలు కోచ్‌లను కలుపుకుంటూ వెళ్లినప్పటికీ 100 శాతం ఆక్యుపెన్సీ వస్తోంది. దీంతో హైదరాబాద్ నుండి గోవాకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌‌కు లేఖ రాశారు. కాగా, మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆపేసింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ముగియడంతో మరోసారి ఈ ప్రతిపాదనను పరిశీలించిన రైల్వే శాఖ కొత్త రైలును మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అంటే ఈ రైలు వారంలో రెండు సార్లు గోవాకు ప్రయాణించనుంది. ప్రతివారం బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ స్టేషన్ నుండి బయలుదేరుతుంది. వాస్కోడగామా చేరుకొని అక్కడి నుండి గురు, శనివారాల్లో తిరుగు ప్రయాణం అవుతుంది.

అయితే సికింద్రాబాద్ నుండి నేరుగా గోవాకు వెళ్లే ఈ రైలు.. తెలంగాణలోని కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్ స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది. అనంతరం మార్గమధ్యలో ఏపీలోని కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్ స్టేషన్లలో ఆగుతూ.. కర్ణాటకలోని బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. అక్కడి నుండి గోవాలోని లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడగామా చేరుకుంటుంది.

newsline-whatsapp-channel
Tags : centralgovernment train goatourism traitogoa secundrabadgoatrain railwayminister ashwinivaishnavi

Related Articles