న్యూస్ లైన్ డెస్క్: కన్సంపల్లి గ్రామాల మధ్యలో ఉన్న విద్యుత్ లైన్ను స్తంభంపై మరమ్మత్తు చేస్తుండగా ప్రమాదవశాత్తు హెల్పర్ చంద్ర శేకేర్ మృతిచెందాడు. ఇంకో హెల్పర్ తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రమాదవశాత్తు మృతి చెందిన చంద్రశేఖర్కు నివాళి అర్పించి గాయపడ్డ మాణిక్యంను పరామర్శించారు. విద్యుత్ అధికారుల మధ్య సమన్వయ లోపం నిండు ప్రాణాలు బలితీసిందని క్రాంతి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో ఆందోల్ నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు జరగడం పరిపాటిగా మారిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా తగుబజాగ్రతలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆయన కోరారు. చనిపోయిన చంద్రశేఖర్ కుటుంబానికి గాయపడ్డ మాణిక్యం కుటుంబానికి ప్రభుత్వం తక్షణం ఆర్థిక సహాయం అందించాలని క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు.