ఆగస్టు 1వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది
న్యూస్ లైన్ డెస్క్ : వేగంగా దూసుకొస్తున్న మహువా సూరత్ ప్యాసింజర్ కి అడ్డుగా వచ్చిన రెండు సింహాలు తీవ్రంగా గాయపడ్డాయి. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గుజరా లోని ఆమ్రేలీ జిల్లా హతీగడ్ – బేసన్ రూట్ లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిదేళ్ల సింహం తీవ్రంగా గాయపడింది. వెంటనే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సింహాన్ని అటవీ జంతువుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన అనంతరం రైలు గంటసేపు నిలిపివేశారు.
ఆ తర్వాత ముందుకెళ్లిన రైలు.. కొద్దిదూరం వెళ్లగానే మరో సింహాన్ని ఢీకొట్టింది. దీంతో.. జంతు పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ జంతువుల సరంక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గాయపడ్డ సింహాలను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నామని గుజరాత్ అటవీ శాఖ అధికారులు తెలిపారు.