VIRAL : భార్యను బైక్ కు కట్టి ఈడ్చుకెళ్ళిన భర్త.. అంత చిన్న కారణానికి ఇంత పెద్ద శిక్షా!!

40 సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో కాపాడమని ఆ మహిళ చేసిన ఆక్రందనలు, ఆర్తనాదాలు చేస్తుంది. వీడియో తీస్తున్న వారి మనసును కూడా కరిగించలేదు. 


Published Aug 13, 2024 09:06:00 PM
postImages/2024-08-13/1723563544_woman.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మద్యం మత్తు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. మద్యం మత్తు లో మనిషి మృగమైపోతున్నాడు. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్యను మట్టి, రాళ్లతో ఉన్న రోడ్లపై కాళ్లకు తాడు కట్టి ఈడ్చుకుంటూ  వెళ్లాడు. ఈ సంఘటన రాజస్థాన్ లోని నాగౌర్ లో జరిగింది. ఊర్లో అందరు చూస్తుండగా ఆ మహిళ ...అరుస్తున్నా..నొప్పితో విలవిలలాడిపోయినా..సాయం చేసే మనిషి రాలేదు. సాయం చేయకపోగా ..వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 40 సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో కాపాడమని ఆ మహిళ చేసిన ఆక్రందనలు, ఆర్తనాదాలు వీడియో తీస్తున్న వారి మనసును కూడా కరిగించలేదు. 


అక్కడే వేరే మహిళ ఉన్నప్పటికీ తాడు కట్టి ఈడ్చుకెళ్తున్న ఆ అమానుష భర్తను ఆపే ప్రయత్నం చేయలేదు. ఇక కాస్త దూరం ఈడ్చుకుని వెళ్లిన తర్వాత బైక్ దిగి ఏదో సాధించినట్టు నడుం మీద చెయ్యి పెట్టుకొని తీవ్ర గాయాలతో అల్లాడుతున్న బాధితురాలని చూస్తూ నిలబడ్డాడు. ఒక్క మహిళ ముందుకు వచ్చి....ఆ మహిళను తాడ్లు విడిపించింది.

 
ఇన్నేళ్లు స్వతంత్ర్యంలో మహిళ ల దుస్థితి ఇంకా కన్నీళ్లు పెట్టిస్తుంది. ఎంతో పెద్ద తప్పు చేస్తేనే ఇంత పెద్ద శిక్ష వేశాడో అనే వారికి ..రీజన్ కూడా చెప్పాలి . సదరు మహిళ తన సోదరి ఇంటికి వెళ్తానని అడిగినందుకు ఇలా చేశాడట. అందుకే ఈ శిక్ష అంటూ చెప్పుకొచ్చాడట.ఈ సంఘటన పైన మాట్లాడిన పోలీసులు రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ప్రేమ్ రామ్ మేఘ్వాల్ భార్య జై సల్మేర్ లోని సోదరి ఇంటికి వెళ్లాలనుకుంది.


కానీ ఆమె భర్త అందుకు నిరాకరించడంతో పాటు ఆమెను వెళ్తానని అడిగినందుకు ద్విచక్ర వాహనానికి కట్టేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి చిత్రహింసలకు గురి చేశాడు. ఇక ప్రేమ్ రామ్ డ్రగ్స్ కు అలవాటు పడి పది నెలల క్రితం ఒక వ్యక్తి నుంచి ఈ మహిళను రెండు లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్టు స్థానికంగా చర్చ జరుగుతుంది . ఉమెన్ ట్రిఫికింగ్ కేసు పై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news india

Related Articles