ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా లో ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటారు. సమాజానికి ఉపయోగపడేది ఏదైనా కనిపిస్తే టక్కున పోస్ట్ చేస్తారు. ఇప్పుడు మరో వీడియో పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా లో ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటారు. సమాజానికి ఉపయోగపడేది ఏదైనా కనిపిస్తే టక్కున పోస్ట్ చేస్తారు. ఇప్పుడు మరో వీడియో పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా.
"రహదారి ఎంత కష్టమైనా సరే.. మీరు మీ గమ్యస్థానానికి కచ్చితంగా చేరుకుంటారు.." అనే లైన్లతో ఆయన 'మండే మోటివేషన్' పేరిట ఒక వీడియోను 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఇది నిజానికి ఈ పదాలు చాలా విలువైనవంటున్నారు నెటిజన్లు.
వీడియోలో బాగా లోతైన గుంతలు కలిగిన రహదారిపై డ్రైవింగ్ పోటీలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అందులో జీపు నడుపుతున్న వ్యక్తి బాగా లోతు గుంతల్లో జీపును నడుపుతున్నాడు. ప్రతి గుంతలో పడినపుడు అయిపోయింది ఇక జీపు పైకి రాదు అనిపిస్తుంది కాని...నిలదొక్కుకొని పైకి నడిపిస్తున్నాడు. దీనికి ఆనంద్ మహీంద్ర...లైఫ్ కూడా ఇంతే గెలవాలని ఉంటే ..చాలా ఈజీగా గెలవగలవు అంటూ వీడియో పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ కాగా, నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
You’ll get to your destination…
No matter how tough the road…#MondayMotivation
pic.twitter.com/2Z1WQmeYPy — anand mahindra (@anandmahindra) July 8, 2024