ఈ రైలు సికింద్రాబాద్ , బేగంపేట స్టేషన్ల వైపు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ స్టాప్ ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు రైల్వే అధికారులు . ఏప్రిల్ 25 నుంచి ఈ జన్మభూమి ఎక్స్ ప్రెస్ అమలులోకి వస్తుందని ఇండియన్ రైల్వే అధికారులు ప్రకటించారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు విశాఖపట్నం-లింగంపల్లి-విశాఖపట్నం మధ్య ప్రతిరోజు నడుస్తుంది. ఈ రైలును దారి మళ్లిస్తున్నారు. చర్లపల్లి - అమ్ముగూడ- సనత్ నగర్ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఏప్రిల్ 25 వ తేదీ నుంచి ఈ రైలు సికింద్రాబాద్ , బేగంపేట స్టేషన్ల వైపు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.