AP: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ..? 2024-06-23 15:25:16

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఏపీ( AP)  రవాణా , క్రీడలు , యువజన సర్వీసుల శాఖల మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్( RAM PRASAD)  భాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా ప్రకటన చేశారు.ప్రకాశం జిల్లా దర్శిలో రూ.18.51 కోట్ల అంచనా వ్యయంతో డ్రైవింగ్ శిక్షణ( DRIVEING ), రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని ( AP) మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో( RTC BUS)  ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటుపాట్లు ఆంధ్రప్రదేశ్‌లో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.


తెలంగాణ( TELANGANA) , కర్ణాటక( KARNATAKA)  రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రాల్లో ఉచితసర్వీసుపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. రాబోయే నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు ఈ బస్సు ప్రయాణం పథకం వస్తుంది.